
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 10 :
నంద్యాలకు రైల్వే పిట్ లైన్ (లేదా వాషింగ్ పిట్ లైన్) కోసం ప్రత్యేక కృషి చేస్తున్నానని, ఇప్పటికే ఈ విషయం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ దృష్టికి తెచ్చానని, వీటి పై పరిశీలించి నివేదిక ఇవ్వాలని రైల్వేశాఖ ఉన్నతాధికారులను కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆదేశించినట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి శనివారం తెలిపారు.
రైల్వే పిట్ లైన్ వల్ల నంద్యాల వాసులకు ఉద్యోగ, ఉపాధి లభిస్తుందని, రైల్వే పిట్ లైన్ (లేదా వాషింగ్ పిట్ లైన్ )అనేది ఒక నియమించబడిన ట్రాక్, తరచుగా పట్టాల క్రింద ఒక తనిఖీ గొయ్యి ఉంటుంది, ఇది ప్రయాణీకుల కోచ్లు లేదా లోకోమోటివ్ల యొక్క సాధారణ శుభ్రపరచడం, తనిఖీ, పరీక్ష చిన్న నిర్వహణ కోసం ఉపయోగించబడుతుంది, దీని వలన సిబ్బంది రైలు కింద వైపులా సులభంగా పని చేయడానికి వీలు కల్పిస్తుంది, కడగడం, బోగీలను తనిఖీ చేయడం, తదుపరి ప్రయాణానికి ముందు భద్రతను నిర్ధారించడం వంటి పనులు చేస్తారు. కోచింగ్ డిపోలలో మొత్తం రేక్లకు సమర్ధవంతంగా సేవ చేయడానికి, టర్నరౌండ్ సమయాన్ని తగ్గించడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇవి కీలకమైనవి. నంద్యాలలో ఈ పిట్ లైన్ ఏర్పాటు వల్ల వందల మంది స్థానికులకు కూడా ఉద్యోగ, ఉపాధి లభిస్తుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు.
