ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేర నియంతరణకు కృషి చేయండి

రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కల్పించండి

జిల్లా పోలీసు అదికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 27 :
నంద్యాల జిల్లాలోని బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS జిల్లా పోలీసు అదికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నందు పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు వాటి పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీసి సమీక్షా నిర్వహించి నేరనియంత్రణకు,పెండింగ్‌ కేసుల దర్యాప్తు, నేరస్థులను గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని( సుధర్శన్, గాండీవ)మొదలగు వాటిని ఉపయోగించుకోవాలని ఆదేశించారు.
• పోలీస్ స్టేషన్ల వారీగాU.I కేసులు తగ్గించుకోవాలన్నారు.నిర్ణీత గడువులోపు పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు.
• మహిళల భద్రత,సైబర్ క్రైమ్,శాంతి భద్రతల పరిరక్షణ, గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసులు, మర్డర్‌, ప్రాపర్టీ, చీటింగ్‌, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించారు.వాటి పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.
• ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకొని దొంగిలించిన సొత్తును రికవరీ చేయాలన్నారు. బీట్లు, పికెట్స్ ఏర్పాటు చేసుకొని అధికారులు తరుచుగా బీట్ చెక్ చేస్తూ సిబ్బందికి సూచనలు ఇవ్వాలన్నారు. దొంగతనాలు, దోపిడీలు, తదితర నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
• తరచూ నేరాలకు పాల్పడేవారిపై PD యాక్ట్ ఉపయోగించి జిల్లా బహిస్కరణకు చర్యలు తీసుకోవాలి.
• శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేకుండా విధులు నిర్వహించాలి.బౌతిక దాడులు జరుగకుండా చర్యలు తీసుకోవాలి.
• రోడ్డు ప్రమాదాల నివారణకు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే రోడ్డు రవాణా సంస్థ,ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టాలి.
• మహిళలు భద్రత కొరకు వారు ఎక్కువగా సంచరించు ప్రదేశాలలో ప్రత్యేక దృష్టి ఉంచి పెట్రోలింగ్ పెంచడంతో పాటు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
• కాలేజీలు ,వసతి గృహాలు మరియు ప్రార్థన ఆలయాలు చర్చి ,మసీదు ,దేవాలయ పరిసర ప్రాంతాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి.
• కోర్టులో ఉన్న పెండింగ్ కేసులను త్వరగా ట్రయల్ కు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N. యుగంధర్ బాబు. M. జావళి ఆల్ఫోన్స్ IPS , ప్రమోద్, రామంజి నాయక్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top