లోక్ సభ స్వీకర్ ఓం ప్రకాష్ బిర్లా ను మర్యాద పూర్వకంగా కలిసిన టీడీపీ ఎంపీలు

లోక్ సభ స్వీకర్ అనుభవం, ఆలోచనలు మాకు ప్రేరణ – ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

సత్యం వార్త / ఫిబ్రవరి 03 :

భారత పార్లమెంట్ భవనం లోని లోక్ సభ స్వీకర్ ఛాంబర్ లో మంగళవారం లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి,  సహచర టిడిపి ఎంపీలతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ సంప్రదాయాలు, ప్రజాప్రతినిధుల పాత్రపై లోక్ సభ స్వీకర్ ఓం ప్రకాష్ బిర్లా తో సార్ధకమైన చర్చ జరిగిందనీ, భారత దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్న స్వీకర్ ఓం ప్రకాష్ బిర్లా అనుభవం, ఆలోచనలు మాకు మరింత ప్రేరణనిచ్చాయని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు.

Scroll to Top