

సత్యం వార్త / నంద్యాల / జనవరి 24 :
పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. శనివారం నంద్యాల మండలంలో కానాల (2మినీ గోకుల షెడ్ల) , హై స్కూల్ కొట్టాలలో (1 మినీ గోకుల షెడ్) నూతనంగా నిర్మించిన ‘మినీ గోకుల షెడ్లను’ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిధిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పశువుల సంరక్షణకు, పాల ఉత్పత్తిని పెంచడానికి ఈ మినీ గోకుల షెడ్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శ ఎన్ఎండి ఫిరోజ్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, పిట్టల హనీఫ్, లాయర్ బాబు, హై స్కూల్ కొట్టాల రవి , స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మార్వో, ఎంపీడీవో మరియు మండల అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
