15 లక్షల విలువచేసే బంగారు వెండి నాగాలతో పాటు నగదు స్వాదినం
– నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఐపిఎస్


సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఏప్రిల్ 03 :
2025 వ సంవత్సరము నుండి ఇప్పటి వరకు నంద్యాల జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలలో అనగా నంద్యాల తాలూకా ,బండిఆత్మకూరు,రేవనూరు,సంజామల,గడివేముల,బేతంచర్ల,అవుకు మొదలగు పోలీసు స్టేషన్ ల పరీదులలో దొంగతనాలకు పాల్పడుతూన్న నేరస్తుల గురుంచి నిఘా ఉంచాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం. జావళి ఆల్పోన్స్ ఐపిఎస్ ఆద్వర్యంలో నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ ఆర్. ఈశ్వరయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి..సురేష్ కుమార్ నిఘా ఉంచడం జరిగింది. 03.04.2026 వ తేదీన నందమూరి నగర్ రోడ్, నాగులకట్ట దగ్గర వున్న టి జంక్షను వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి నంబర్ ప్లేట్ లేని పల్సర్ మోటార్ సైకల్ వస్తు పోలీసు వారిని చూసి మోటార్ సైకల్ ను తిప్పుకొని పారిపోవుటకు ప్రయత్నించగా అతనిని పట్టుకొని విచారించడం జరిగింది. ఇతడు జల్సాలకు అలవాటుపడి పలు పోలీసు స్టేషన్ ల పరీదులలో దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతు ఉండేవాడు.
ఈ సందర్బంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఐపిఎస్, మరియు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పి. జావళి ఆల్పోన్స్ ఐపిఎస్ నిందితుని అరెస్ట్ లో కీలక పాత్ర పోషిoచిన నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ ఆర్ .ఈశ్వరయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి.సురేష్ కుమార్, నంద్యాల తాలూకా పిఎస్ సిబ్బంది, పీసీఎస్ బి.రవికుమార్, యం.గంగాధర్ మరియు సిసిఎస్ సిబ్బంది హెచ్సిఎస్ , ఇబ్రహిం, పీసీఎస్ మలిక్ బాష, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, గంగారం మరియు కృష్ణమ నాయుడు లను ప్రత్యేకముగా అభినందించడమైనది…
ముద్దాయి వివరాలు : షేక్ బాబావలి, తండ్రి షేక్ కరీముల్లా, వయస్సు 25 సం లు, YSR నగర్, ఇంటి నెంబర్ 25-450-2B-109, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా…
రికవరీ చేసిన సొత్తు వివరాలు: 98 గ్రాముల బంగారు నగలను, 400 గ్రాముల వెండి వస్తువులను మరియు 54,500/-నగదు, మొత్తం విలువ సుమారు 15 లక్షలు స్వాదినం చేసుకోవడం జరిగింది.
