దేశంలో కమ్యూనిస్టులు కలవాల్సిన సమయం ఆసన్నమైనది–

దేశ వ్యాప్తంగా నిరుద్యోగులను మోసం చేసిన మోదీ ప్రభుత్వం–

మతోన్మాదన్ని పెంచి పోషిస్తున్న మోదీ ప్రభుత్వం—

లౌకిక, ప్రజాతంత్ర,ప్రజాస్వామ్య శక్తులంత ఏకమై సమైక్య ఉద్యమాలకు సిద్ధం అవుతాం

ప్రజా వ్యతిరేఖవిధానాలకు వ్యతిరేఖంగా మరో స్వతంత్ర ఉద్యమానికి కమ్యూనిస్టులంత ఏకం కావాలి

నంద్యాల లో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పిలుపునిచ్చిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ

పాలకులు అవలంబిస్తున్న విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి—

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.రామాంజినేయులు

వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి

నంద్యాల లో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ప్రసంగించిన

సీపీఎం(CPM) నంద్యాల జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్

అన్ని వర్గాల ప్రజా సమస్యలు గాలికొదిలేసిన కూటమి ప్రభుతవ్వానికి ఐక్య పోరాటాల ద్వారా బుద్ది చెప్తాం

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రామచంద్రయ్య

ఈ సెమినార్ ప్రారంబానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి శివయ్య, బ్లైండ్ క్రికెటర్ ప్రేమ్ కుమార్ బృందం విప్లవ గేయాలను పాడడం జరిగింది.

భారతదేశ కమ్యూనిస్టుల ఐక్యత-నేటి ఆవశ్యకత అనే అంశంపై సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి  రంగనాయుడు గారి అధ్యక్షతన నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు వివేకానంద ఆడిటరియం నందు సెమీనార్ నిర్వహించడం జరిగింది.

ఈ సెమినార్ కు సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కే రామకృష్ణ గారు,సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే. ప్రభాకర్ రెడ్డి గారు,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.రామాంజనేయులుగారు,సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. పి.రామచంద్రయ్యగారు,సిపిఎం జిల్లా కార్యదర్శి టి. రమేష్ కుమార్ గారు.ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రసంగించారు.

 మరియు ఈ సదస్సులో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలా నియోజకవర్గ కేంద్రాల్లోని సిపిఐ ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top