మన ఇంటి లాగే మనం పనిచేసే చోట పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి
- జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్



సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 21 :
ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి 3 శనివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క పిలుపుమేరకు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లు పోలీస్ కార్యాలయాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులతో, నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు నేడు నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లు పోలీస్ కార్యాలయాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని డి.సి.ఆర్.బి., స్పెషల్ బ్రాంచ్, పాస్పోర్ట్ కార్యాలయం, సైబర్ క్రైమ్ , ఫ్యాక్షన్ జోన్ కార్యాలయాలు, సాయుధ బలగాల కార్యాలయాలు, మోటార్ వెహికల్ కార్యాలయం, మరియు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు పోలీస్ కార్యాలయాలలో జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది తమ కార్యాలయాలు మరియు చుట్టు పక్కల ప్రాంగణాలను సమగ్రంగా పరిశుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా మొక్కలను నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధులు నిర్వహించే చోట వాతావరణాన్ని పరి శుభ్రంగా ఉంచుకోవడం సిబ్బంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మన ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా పనిచేసే చోటా పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలు అనగా డెంగ్యూ, మలేరియా విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా ఉంటాయని, పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు.
