




మంత్రి ఎన్ఎండి ఫరూక్ కి కృతజ్ఞతలు తెలిపిన ధర్మకర్తల మండలి సభ్యులు
సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 16 :
నంద్యాల పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్గా బింగుమళ్ల సుబ్బలక్ష్మయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలక మండలి సభ్యులతో కలిసి ఆయన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని నంద్యాల మంత్రిగారి క్యాంపు కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. తమపై నమ్మకంతో దేవస్థాన అభివృద్ధికి బాధ్యతలు అప్పగించినందుకు మంత్రి ఫరూక్ కి, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ కి ఈ సందర్భంగా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ బింగుమళ్ల సుబ్బలక్ష్మయ్య, సభ్యులు వసుంధర దేవి, శివపురం సుబ్రమణ్యం, 12 వార్డ్ కౌన్సిలర్ కండె శ్యాంసుందర్ లాల్,తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి బింగుమళ్ల శ్యామ్ సుందర్ గుప్త, అడ్వకేట్ గంగిశెట్టి రాజేష్, కుంచపు రమణ తదితరులు పాల్గొన్నారు.
