శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు

శివరాత్రి బందోబస్తుకు వచ్చిన అధికారులతో సమావేశం ఏర్పాటు

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా చర్యలు

మ్యాప్ ఆధారంగా బందోబస్తులో చేయవలసిన విధులపై సవివరంగా తెలియజేసిన జిల్లా ఎస్పీ

  • జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్

సత్యం వార్త / (శ్రీశైలం) నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 13 :

నంద్యాల జిల్లాలోని మహా పుణ్యక్షేత్రం మరియు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం నందు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుచున్న నేపథ్యంలో ప్రజల (భక్తుల)భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకుని సుమారు 1782 మంది అధికారులు సిబ్బందిచే ప్రతిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి బందోబస్తుకు వచ్చిన అడిషనల్ ఎస్పీ మరియు డిఎస్పీలతో నేడు శ్రీశైలం పోలీస్ స్టేషన్ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం జరిగింది.

ఎస్పీ బందోబస్తును 10 సెక్టార్లుగా విభజించడం జరిగిందని ప్రతి సెక్టార్ గురించిన వివరాలను మ్యాప్ లో చూపిస్తూ చేయవలసిన విధులపై సవివరంగా తెలియజేయడం జరిగింది.

అధికారులు సిబ్బంది వివరాలు :  కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, కడప జిల్లాల నుండి సుమారు 1614 మంది సివిల్ పోలీస్ అధికారులు సిబ్బంది.

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ మరియు ఆర్ముడు రిజర్వు సిబ్బంది (ఎఆర్) 34 మంది సిబ్బందితోపాటు 3 ఆర్‌ఎస్‌ఐ లు ఉన్నారు.

స్పెషల్ పార్టీలు 03 అనగా సిబ్బంది 24 మంది సిబ్బందితో పాటు ఆర్‌ఎస్‌ఐ లు 03 మంది నియమించడం జరిగింది.

బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి ముగింపు వరకు నిరంతరం కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది.

సిబ్బంది మరియు అధికారులు భక్తులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికి మార్గ నిర్దేశం చేయాలి.

లడ్డు కౌంటర్ల వద్ద క్యూలైన్లో భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.

వాహనాల రద్దీ పెరుగుతూ ఉండడం వలన ట్రాఫిక్ అధికారులు వారి సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తూ వాహనాలను రోడ్డుకు ఇరువైపులా ఉంచకుండా పార్కింగ్ ప్రదేశంలో మాత్రమే నిలుపుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది.

ASPలు — 11,

DSPలు — 24

CIలు ——-78

SIలు ——132

ASI/HCలు-303

PC లు ——-568

WPC లు —- 88

HG లు ——- 386

WHG లు ——-30

Total 1614 మందిని నియమించడం జరిగింది.

Scroll to Top