

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / ఫిబ్రవరి 08 :
నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలి
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ ఆదేశాలమేరకు జిల్లాలో నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసిస్తున్న రౌడీ షీటర్లకు ,నేరచరిత్ర గలవారికి ,చెడు నడత కలిగిన వ్యక్తులకు సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కౌన్సెలింగ్ నిర్వహించారు.
అనంతరం ప్రస్తుతం వారు జీవిస్తున్న విధానం, జీవనోపాధికి చేస్తున్న వృత్తులపై ఆరా తీశారు.అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న రాదని మీపై నిరంతరం నిఘా ఉంటుందని,పోలీసుల మాటలను వినకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ అధికారులు హెచ్చరించారు.
