శివ పార్వతుల కళ్యాణంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 16 :

నంద్యాల జిల్లా నందుకొట్కూరు నియోజకవర్గం, పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం తెల్లవారుజామున వేద పండితులు తెలకపల్లి రఘురామశర్మ పర్యవేక్షణలో వైభవంగా శివ పార్వతుల కళ్యాణం జరిగింది.  తన సొంత గ్రామం పాత ముచ్చుమర్రి శివాలయంలో జరిగే మహా శివరాత్రి విశేష పూజలకు పూజలకు గ్రామ పెద్దల ఆహ్వానం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేద పండితులు తెలకపల్లి రఘురామశర్మ పర్యవేక్షణలో పాత ముచ్చుమర్రి శివాలయంలో మహా శివరాత్రి విశేష పూజలు జరిగాయి. అర్ధరాత్రి 12.4 గంటల సమయంలో మహా అద్భుతంగా లింగోద్భావం, సోమవారం తెల్లవారుజామున 12.45 గంటలకు శివపార్వతుల కళ్యాణం కనులపండువలా నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి లింగోద్భవ ప్రత్యేక పూజల్లో, శివపార్వతుల కళ్యాణంలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు పూజలు చేసి, దర్శనం చేసుకున్నారు. మహా శివరాత్రి విశేష పూజల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Scroll to Top