తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలు, బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష పోటీలలో 140 మంది తైక్వాండో క్రీడాకారులు

క్రీడలు విద్యార్థులలో ఆత్మస్థైర్యం కలిగిస్తాయి: ఆదాయ పన్ను అధికారి రమణారావు

తైక్వాండో బెల్ట్ లు ప్రదానం చేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి, రమణారావు, డాక్టర్ రవి కృష్ణ

నిర్వహించిన రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, మాస్టర్ బాలకృష్ణ

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 07 :

కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల స్వామి వివేకానంద ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష పోటీలలో 140 మంది తైక్వాండో క్రీడాకారులు పాల్గొని వివిధ కేటగిరి బెల్ట్ లు సాధించారు.

ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్ టి చంద్రమౌళి ఆధ్వర్యంలో, మాస్టర్ బాలకృష్ణ నిర్వహణలో, కర్నూలు జిల్లా మాజీ ఒలంపిక్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రదానోత్సవం లో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, చిత్తూరు జిల్లా ఆదాయ పన్ను అధికారి రమణారావు,నంద్యాల జిల్లా క్రీడాభారతి అధ్యక్షులు సుధాకర్ అతిధులుగా పాల్గొని క్రీడాకారులకు వివిధ కేటగిరి బెల్ట్ లను అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఆదాయ పన్ను అధికారి రమణ రావు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులలో ఆత్మస్థైర్యం, శారీరిక దారుఢ్యం, మానసిక వికాసం, క్రమశిక్షణ,  ఏకాగ్రతలను ఇనుమడింపచేస్తాయని అన్నారు.

సుధాకర్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ క్రీడలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంచుతుందని అన్నారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ తైక్వాండో ఒలింపిక్ లో గుర్తింపు పొందిన క్రీడ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో క్రీడాకారులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Scroll to Top